News October 4, 2024
విచారణపై కేంద్రం పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది: తుషార్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు నమ్మకం ఉందని కేంద్రం తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా అన్నారు. అయితే విచారణపై కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. సుప్రీం ఏం చెబుతుందో వేచి చూడాలి.
Similar News
News October 8, 2024
ఇరాన్ అణు పరీక్షలు జరిపిందా..?
తరచూ భూకంపాలు ఎదుర్కొనే ఇరాన్లో అక్టోబర్ 5న వచ్చిన భూప్రకంపనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ వందల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించిన కొన్ని రోజుల తరువాత ఈ ప్రకంపనలు రావడంతో ఇరాన్ అణు పరీక్షలు జరిపిందనే ప్రచారం ఊపందుకుంది. సెమ్నాన్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదవ్వడంతో అణు పరీక్షలపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News October 8, 2024
రేపు HYDకు సమంత.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా?
మంత్రి కొండా సురేఖ ఆరోపణల తర్వాత తొలిసారి హీరోయిన్ సమంత రేపు హైదరాబాద్కు రానున్నారు. ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు ఆమె హాజరుకానున్నారు. దీంతో సమంత ఈ విషయంపై ఏమైనా మాట్లాడతారా? అనేదానిపై చర్చ మొదలైంది. మీడియా ఈ విషయంపై ప్రస్తావిస్తే ఆమె స్పందిస్తారా? లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సమంతతో పాటు రానా, త్రివిక్రమ్ కూడా ఈవెంట్లో పాల్గొననున్నారు.
News October 8, 2024
మనుషులతో కాదు.. రోబోలతో శృంగారానికి ప్రాధాన్యత!
భవిష్యత్లో మహిళలు రోబోలతో ప్రేమలో పడతారని, శృంగారం విషయంలో పురుషుల కంటే వాటినే ఎక్కువగా ఇష్టపడతారని ఫ్యూచరాలజిస్ట్ డా.పియర్సన్ తెలిపారు. 2030నాటికి వర్చువల్ రియాలిటీ శృంగారం సర్వసాధారణమైపోతుందని, 2035 నాటికి శృంగార సంబంధిత పరికరాలు దీనితో లింక్ అవుతాయన్నారు. 2050 నాటికి రోబోట్ శృంగారం కామన్గా మారుతుందని అంచనా వేశారు. ఒకవేళ నిజమైన రిలేషన్షిప్స్ ఉంటే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్నారు.