News October 4, 2024

విచారణపై కేంద్రం పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది: తుషార్

image

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందని కేంద్రం తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా అన్నారు. అయితే విచారణపై కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. సుప్రీం ఏం చెబుతుందో వేచి చూడాలి.

Similar News

News January 10, 2026

టికెట్ ధరల పెంపు మీకు ఓకేనా?

image

సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రశ్న. ఒకవైపు ‘భారీ బడ్జెట్ సినిమాలకు పెంపు తప్పదు’ అని మేకర్స్ అంటుంటే, ‘సామాన్యుడు వినోదానికి దూరం కావాలా?’ అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సినిమా బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతాం అనుకునే వారు కొందరైతే, కుటుంబంతో కలిసి చూడాలంటే ఈ ధరలు భారమేనని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు. ఓ సామాన్యుడిగా టికెట్ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి? COMMENT

News January 10, 2026

అమరావతిపై జగన్ అడిగింది అదే: సజ్జల

image

AP: CM CBN చెబుతున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్‌ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.

News January 10, 2026

సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

image

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్‌మోడల్‌లా ఉండాలంటున్నారు.