News September 9, 2024

ఎల్లుండి తెలంగాణకు కేంద్ర బృందం: కిషన్‌రెడ్డి

image

TG: వరద నష్టాన్ని అంచనా వేయడం కోసం ఈ నెల 11న కేంద్ర బృందం రాష్ట్రానికి రానుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. బాధితులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో వీరు సమావేశమై నష్ట వివరాలను తెలుసుకుంటారని చెప్పారు.

Similar News

News November 12, 2025

కష్టాలు ఎన్ని రకాలంటే..?

image

మనుషులు పడే కష్టాలను వేదాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అందులో మొదటిది ఆధ్యాత్మిక దుఖాలు. శరీరంలో కలిగే రోగాలు, కోపం, కపటం, బద్ధకం వల్ల అంతర్గతంగా ఏర్పడతాయి. రెండవది ఆది భౌతిక దుఃఖాలు. ఇవి పంచభూతాలు, శత్రువులు, జంతువులు, కీటకాల వంటి బయటి జీవుల వల్ల కలుగుతాయి. మూడవది ఆది దైవిక దుఃఖాలు. ఇవి ప్రకృతి శక్తులైన అతివృష్టి, అనావృష్టి, పిడుగులు, గ్రహబాధల వల్ల సంభవిస్తాయి. వీటిని దాటడమే మోక్షం. <<-se>>#VedikVibes<<>>

News November 12, 2025

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు: YCP

image

AP: తమ హయాంలో తిరుమల శ్రీవారి వైభవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఎలాంటి తప్పూ చేయలేదని వైసీపీ ట్వీట్ చేసింది. ‘లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు. కావాలంటే రికార్డులు చూసుకోండి. సిట్ విచారణలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీగా సమాధానం ఇచ్చారు. కల్తీ నెయ్యి అంటూ గగ్గోలు పెట్టిన పచ్చమంద సైలెంట్ అయింది’ అని విమర్శించింది.

News November 12, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హోంమంత్రి అనిత సూచించారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి జగన్ ప్యాలెస్‌ కట్టుకున్నారని మంత్రి సత్యప్రసాద్ ఫైరయ్యారు. సెంటు పట్టా పేరుతో ₹7,500Cr దోచుకున్నారని ఆరోపించారు.
* శ్రీకాకుళం IIITలో సృజన్(20) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు కారణాలు తెలియరాలేదు.