News September 9, 2024

ఎల్లుండి తెలంగాణకు కేంద్ర బృందం: కిషన్‌రెడ్డి

image

TG: వరద నష్టాన్ని అంచనా వేయడం కోసం ఈ నెల 11న కేంద్ర బృందం రాష్ట్రానికి రానుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. బాధితులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో వీరు సమావేశమై నష్ట వివరాలను తెలుసుకుంటారని చెప్పారు.

Similar News

News November 14, 2025

ప్రీక్లాంప్సియా లక్షణాలు

image

ప్రీక్లాంప్సియా గర్భధారణ సంబంధిత ఆరోగ్య సమస్య. ఇది హైబీపీతో ప్రారంభమై, ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ప్రీక్లాంప్సియా ఉన్న గర్భిణుల్లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, ముఖం వాపు, తలనొప్పి, మసక మసకగా కనిపించడం, కంటిలో నల్లటి మచ్చలు, కడుపులో కుడివైపునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటివి. ప్రెగ్నెన్సీలో ఒత్తిడికి దూరంగా ఉంటూ, రక్తప్రసరణ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

News November 14, 2025

బెంగాల్, UPలో ఈ గేమ్ సాగదు: అఖిలేశ్ యాదవ్

image

బిహార్‌లో SIR పేరుతో ఆడిన గేమ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, యూపీ, ఇతర రాష్ట్రాల్లో ఇకపై సాగదని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. బీజేపీ ఎన్నికల కుట్ర బయటపడిందని ఆరోపించారు. ‘వాళ్ల ఆటలు సాగనివ్వం. అలర్ట్‌గా ఉంటాం. బీజేపీ చర్యలను అడ్డుకుంటాం. బీజేపీ అంటే పార్టీ కాదు.. మోసం’ అని ట్వీట్ చేశారు. కాగా బిహార్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది.

News November 14, 2025

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

image

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలు కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్‌కు పనికిరాకుండాపోతాయి.