News January 7, 2025

కరవు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన రేపటి నుంచి..

image

AP: రాష్ట్రంలోని కరవు మండలాల్లో రేపటి నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రేపు, ఎల్లుండి పర్యటించి కరవు పరిస్థితులను తెలుసుకోనుంది. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని 27మండలాల్లో తీవ్ర కరవు, మరో 27మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు 3బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు.

Similar News

News November 21, 2025

స్వీట్ కార్న్.. కోత సమయాన్ని ఎలా గుర్తించాలి?

image

తీపి మొక్కజొన్న కండెలపై కొంచెం ఎండిన పీచు, కండెపై బిగుతుగా ఉన్న ఆకు పచ్చని పొట్టు, బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గింజపై గిల్లితే పాలు కారతాయి. ఈ సమయంలో కండెలను కోయడం మంచిది. కోత ఆలస్యమైతే గింజలోని తీపిదనం తగ్గుతుంది. తీపి మొక్కజొన్నను దఫదఫాలుగా విత్తుకుంటే పంట ఒకేసారి కోతకు వచ్చి వృథా కాకుండా పలు దఫాలుగా మార్కెట్ చేసుకోవచ్చు.

News November 21, 2025

భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 21, 2025

Hello Day: ఇవాళ్టి స్పెషాలిటీ ఇదే..

image

ఎదుటివారితో మన సాధారణ పలకరింపులు, ఫోన్ కన్వర్జేషన్లు Helloతోనే మొదలవుతాయి. ఇంత ప్రాధాన్యమున్న ‘హలో’నూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ డే ఉంది. అది ఈ రోజే(NOV21). 1973లో ఈజిప్ట్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని రూపొందించారు. ప్రపంచ నాయకులు సంఘర్షణలను కమ్యూనికేషన్‌తో పరిష్కరించుకోవాలనేది దీని ఉద్దేశం. ప్రజలు కూడా కనీసం 10 మందికి శుభాకాంక్షలు చెప్పి ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు.