News January 25, 2025
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వారిని ఈ అవార్డులతో సత్కరించింది. డా. నీర్జా భట్ల(ఢిల్లీ), సామాజిక కార్యకర్త భీమ్ సింగ్ భవేశ్(బిహార్), సంగీత విద్వాంసుడు దక్షిణమూర్తి(తమిళనాడు), పండ్ల రైతు హంగ్ తింగ్(నాగాలాండ్), హరిమాణ్ శర్మ(హిమాచల్ ప్రదేశ్) పద్మశ్రీకి ఎంపిక చేసింది. పూర్తి లిస్టు మరికాసేపట్లో రానుంది.
Similar News
News December 1, 2025
కాకినాడ జిల్లాలో 42 మంది స్క్రబ్ టైఫస్ వైరస్: DMHO

స్క్రబ్ టైఫస్ జ్వరాలతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు 42 కేసులు పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ సోమవారం తెలిపారు. 232 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. నల్లి మాదిరిగా ఉండే స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
News December 1, 2025
పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.
News December 1, 2025
42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.


