News February 16, 2025
కేంద్రం ఢిల్లీ తొక్కిసలాట మృతుల సంఖ్యను వెల్లడించాలి: కాంగ్రెస్

ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. ఎంతమంది చనిపోయారో, క్షతగాత్రులెంతమంది ఉన్నారన్న వివరాల్ని కేంద్రం వెంటనే బయటపెట్టాలి. గల్లంతైన వారి వివరాల్ని ప్రకటించాలి. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సహాయం అందించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 6

శంకర సువన కేసరీనందన|
తేజ ప్రతాప మహా జగవందన||
హనుమంతుడు సాక్షాత్తూ శివుని అంశ నుంచి జన్మించాడు. అలాగే కేసరి నందనుడు. ఆయన తేజస్సు, ప్రతాపం అపారం. అందుకే సమస్త జగత్తు ఆయనకు నమస్కరిస్తుంది. ఆయన దర్శనం, స్మరణ మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతాయి. ప్రతికూల పరిస్థితులలో భయం వీడేలా ఆయన తేజస్సు మనకు శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 11, 2025
నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..

TG: ఇవాళ <<18244091>>జూబ్లీహిల్స్<<>> అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలను అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉ.7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJP మధ్య పోటీ నెలకొంది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి నవీన్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.
News November 11, 2025
ఏపీ టుడే

* జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం.. విజయవాడలో రాష్ట్ర స్థాయి వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
* ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 50 MSME పార్కులు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* ఇవాళ బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. మొంథా తుఫానుతో పంట నష్టం పరిశీలన
* శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’.. ఈ నెల 20 వరకు నిర్వహణ


