News May 12, 2024
భారత్పై జపాన్ సంస్థ సీఈఓ ఆశ్చర్యం

భారత సంస్కృతిని చూసి ఆశ్చర్యం కలిగిందని టెక్ జపాన్ వ్యవస్థాపకుడు నౌటకా నిషియామా తెలిపారు. భారత జీవనశైలిపై ఆసక్తితో గత నెలరోజులుగా ఆయన బెంగళూరులో ఉంటున్నారు. ఈక్రమంలో లింక్డ్ ఇన్లో తన అనుభవాలను పంచుకున్నారు. ‘భారత్లో వివిధ మతాలు, జాతులు ఉన్నా అందరూ కలిసి ఉండటం అద్భుతం. ప్రపంచానికి భారత నాయకత్వం అవసరం. ఇప్పటికే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటివారు అగ్రసంస్థల్ని నడిపిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>