News December 7, 2024

పోలవరం గడువు మార్పుపై సీఈవో అభ్యంతరం

image

AP: పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినందునే డెడ్‌లైన్‌ను ప్రకటించామని పీపీఏ సీఈవో అతుల్ జైన్ తెలిపారు. ఇప్పుడు 2027 డిసెంబర్‌కు పనులు పూర్తిచేస్తామని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 2న డయాఫ్రం వాల్ పనులు మొదలు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,300 కోట్లలో 75% నిధులు ఖర్చు పెడితేనే తదుపరి వాయిదా చెల్లిస్తామన్నారు.

Similar News

News November 7, 2025

HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

image

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

News November 7, 2025

సిరీస్‌పై భారత్ కన్ను!

image

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 2-1తో లీడ్‌లో ఉన్న భారత్ రేపు జరిగే చివరి(5వ) మ్యాచులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోగా ఇదైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే మ్యాచ్ జరిగే గబ్బా(బ్రిస్బేన్) గ్రౌండ్‌లో ఆసీస్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006 నుంచి ఇక్కడ ఆ జట్టు 8 టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే ఓడింది. దీంతో ఆసీస్‌ను ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

News November 7, 2025

MP అకౌంట్ నుంచి ₹56 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

image

TMC MP కళ్యాణ్ బెనర్జీ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ₹56L మాయం చేశారు. బెనర్జీ MLAగా ఉన్నప్పుడు కోల్‌కతాలోని SBI హైకోర్టు బ్రాంచిలో తీసిన అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్‌గా ఉంది. ఇటీవల నేరగాళ్లు మార్ఫ్‌డ్ పత్రాలు, ఫొటోలతో KYCలో ఫోన్ నంబర్‌ మార్చి డబ్బు మాయం చేశారు. MP ఫిర్యాదుతో అధికారులు కేసు పెట్టారు. ‘బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు’ అని బెనర్జీ విమర్శించారు.