News March 21, 2025
చాహల్-ధనశ్రీ విడాకులు.. అప్పటి నుంచే దూరం!

చాహల్ – ధనశ్రీ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేయగా, రూ.4.75కోట్ల భరణం చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. కాగా 2020 డిసెంబర్లో వీరికి పెళ్లవగా, ఏడాదిన్నరకే (2022 జూన్) సపరేట్ అయినట్లు విడాకుల పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధనశ్రీ ఫేమ్ కోసం చాహల్ను వాడుకున్నారని కొందరు అంటుండగా, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
Similar News
News March 28, 2025
అత్యంత శక్తిమంతుల జాబితా.. PM మోదీ టాప్

Indian Express నివేదిక ప్రకారం మన దేశంలోని 100 మంది అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమిత్ షా, జైశంకర్, మోహన్ భాగవత్ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 14, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానాల్లో నిలిచారు. ఇక క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 48వ స్థానంలో ఉండగా, విరాట్ 72, బుమ్రా 83వ ప్లేస్లలో ఉన్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <
News March 28, 2025
BREAKING: 2 శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఉగాది కానుక ఇచ్చింది. 2 శాతం డీఏ పెంపునకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారి డీఏ 53 నుంచి 55 శాతానికి చేరింది. ఏడో వేతన సవరణ సంఘం సూచనతో ఈ పెంపు లభించింది.
News March 28, 2025
వద్దనుకొని పోయి మళ్లీ వస్తున్న FIIs

వరుసగా 2 నెలలు షేర్లను తెగ అమ్మిన FIIs మార్చిలో తొలిసారి నెట్ బయ్యర్లుగా అవతరించారు. NSDL ప్రకారం MAR 26 నాటికి రూ.67 కోట్లతో వారు నెట్ సెల్లర్లుగా ఉన్నారు. నిఫ్టీ రీజిగ్, వాల్యూయేషన్లు మారడం, RBI రెండోసారి వడ్డీరేట్లు తగ్గించేందుకు సిద్ధమవ్వడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో తిరిగి భారత్ బాట పట్టారు. MAR 27కి వారి పెట్టుబడి రూ.11,000 కోట్లు దాటిందని NSE ప్రొవిజినల్ డేటా చెప్తోంది.