News October 21, 2024
48 రన్స్ చేసిన చాహల్.. క్రికెటర్ల ఆశ్చర్యం

రంజీ ట్రోఫీలో భారత బౌలర్ చాహల్ 48 రన్స్ చేయడంపై పలువురు క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. హరియాణా తరఫున పదో స్థానంలో వచ్చిన చాహల్.. యూపీపై 152 బంతులాడి 2 రన్స్ తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ‘వాహ్ ఉస్తాద్.. సూపర్ బ్యాటింగ్’ అని రైనా ప్రశంసలు కురిపించారు. ‘ఎన్ని రన్స్ చేశావ్?’ అని బట్లర్ అడగ్గా.. ’48 రన్స్ కొట్టా. నాతో కలిసి ఓపెనింగ్ చెయ్ జోష్ భాయ్’ అని చాహల్ నవ్వులు పూయించారు.
Similar News
News January 7, 2026
రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

AP: రాజధాని అమరావతిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది. మంత్రి నారాయణ గుంటూరు(D) వడ్డమానులో ల్యాండ్ పూలింగ్ 2.0ను స్టార్ట్ చేశారు. రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో గ్రామసభ నిర్వహించనున్నారు. కాగా ఈ విడతలో రైతుల నుంచి CRDA 16,666 ఎకరాలను సమీకరించనుంది.
News January 7, 2026
‘ప్రజల భద్రతే ముఖ్యం’.. వెనిజులా సంక్షోభంపై భారత్ ఆందోళన

వెనిజులా తాజా పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ లక్సెంబర్గ్లో మాట్లాడుతూ.. ‘వెనిజులా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ శాంతి నెలకొనాలని, అన్ని పక్షాలు ప్రజల భద్రత, సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. వెనిజులాతో భారత్కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభం నుంచి ఆ దేశ ప్రజలు సురక్షితంగా బయటపడాలన్నదే మా ఆకాంక్ష’ అని అన్నారు.
News January 7, 2026
ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్: రవాణా శాఖ

AP: సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.


