News October 9, 2024
దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?

ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక వేళ టీమ్ ఇండియా ఫైనల్కు వెళ్తే దుబాయ్ వేదికగా ఫైనల్ నిర్వహించాలని ICC యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే లాహోర్లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ కోసం భారత్ పాక్కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. హైబ్రిడ్ విధానంలో టీమ్ ఇండియా ఆడే అన్ని మ్యాచ్లు తటస్థ వేదికల్లో నిర్వహించాలని ICCని BCCI కోరుతోంది. దీనిపై ఐసీసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు టాక్.
Similar News
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.
News November 27, 2025
పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>


