News October 9, 2024

దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక వేళ టీమ్ ఇండియా ఫైనల్‌కు వెళ్తే దుబాయ్ వేదికగా ఫైనల్ నిర్వహించాలని ICC యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే లాహోర్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ కోసం భారత్ పాక్‌కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. హైబ్రిడ్ విధానంలో టీమ్ ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించాలని ICCని BCCI కోరుతోంది. దీనిపై ఐసీసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు టాక్.

Similar News

News January 24, 2026

VZM: ‘పరిశ్రమల అనుమతులు గడువు లోపలే ఇవ్వాలి’

image

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను గడువు లోపలే ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సింగిల్ విండో విధానం ద్వారా డిసెంబర్ 26 నుంచి జనవరి 20 వరకు వచ్చిన 649 దరఖాస్తుల్లో 618కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని, పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.

News January 24, 2026

VZM: ‘పరిశ్రమల అనుమతులు గడువు లోపలే ఇవ్వాలి’

image

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను గడువు లోపలే ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సింగిల్ విండో విధానం ద్వారా డిసెంబర్ 26 నుంచి జనవరి 20 వరకు వచ్చిన 649 దరఖాస్తుల్లో 618కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని, పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.

News January 24, 2026

దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి కేకే లైన్ దూరమవుతోందా?

image

కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే‌ లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం లభిస్తోంది. కొత్తవలస జంక్షన్‌తో పాటు శ్రీకాకుళం జిల్లాలో పలు సెక్షన్లు రాయగడ డివిజన్‌కు వెళ్లే పరిస్థితి తలెత్తుతోంది. రైల్వేలో ఉత్తరాంధ్రపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఈ మార్గం కోల్పోతే జోన్ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుంది.