News November 30, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ అంగీకారం.. కానీ!

ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకు పాక్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకు పలు కండీషన్లు పెట్టిందని ICC వర్గాలు తెలిపాయి. వాటి ప్రకారం.. భారత్ మ్యాచులన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఒకవేళ గ్రూప్ స్టేజ్ దాటి భారత్ క్వాలిఫై కాకపోతే సెమీస్, ఫైనల్స్ పాక్లో నిర్వహించాలి. టోర్నీకి తమకు వచ్చే ఆదాయాన్ని పెంచాలి. 2031 వరకు భారత్లో జరిగే ఐసీసీ టోర్నీలను పాక్ కూడా హైబ్రిడ్ విధానంలోనే ఆడుతుంది.
Similar News
News January 16, 2026
రొమాన్స్కు నో చెప్తే ఒత్తిడి చేశారు: తమన్నా

కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడినట్లు హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీనియర్ స్టార్లతో రొమాన్స్(ఇంటిమేట్) చేయాలని దర్శకుడు కోరితే కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పా. ఆ సమయంలో హీరోయిన్ను మార్చాలని అరుస్తూ దర్శకుడు నాపై ఒత్తిడి చేయాలని చూశారు. అయినా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నా. చివరకు దర్శకుడే సారీ చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సురక్షితమైన వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.
News January 16, 2026
IBPS ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

2026-27కు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్ను IBPS రిలీజ్ చేసింది.
* ప్రొబెషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీస్ (MT): ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో, అక్టోబర్ 4న మెయిన్ ఎగ్జామ్
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO): ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 29, మెయిన్ నవంబర్ 1
* కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA): ప్రిలిమినరీ అక్టోబర్ 10, 11. మెయిన్ డిసెంబర్ 27. పూర్తి వివరాలకు <
News January 16, 2026
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా!

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా EPF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా నేరుగా లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి PFను ట్రాన్స్ఫర్ చేసే విధానం రానుందని పేర్కొన్నాయి. UPI పిన్ ఎంటర్ చేసి క్షణాల్లోనే నగదును విత్డ్రా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ విధానం అమలుకు సమస్యల పరిష్కారంపై EPFO ఫోకస్ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.


