News November 19, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరిగి తీరుతుంది: పీసీబీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందని పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ‘అసలు తమ దేశానికి భారత్ ఎందుకు రాదో లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలి. పాక్‌లో పర్యటించడానికి భారత్‌కు ఏంటీ సమస్య? ఇకపై బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గం. ఐసీసీ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News October 16, 2025

కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

image

TG: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. <<18018400>>వివాదం<<>> నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్ఠానం కూడా రిజైన్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. HNKలోని ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ, పోలీస్ ఔట్ పోస్టును తొలగించడం వీటికి బలం చేకూరుస్తున్నాయి. అటు సురేఖ BC నేత కావడంతో అధిష్ఠానం అంత ఈజీగా పదవి నుంచి తొలగిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

News October 16, 2025

రిజర్వేషన్లు 50% మించొద్దనడం సరికాదు: సింఘ్వీ

image

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తక్షణం జోక్యం చేసుకోవాలని TG తరఫున సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచామని, రిజర్వేషన్లు 50 శాతం మించరాదనడం సరికాదని వాదించారు.

News October 16, 2025

ట్రాఫిక్‌లోనే జీవితం అయిపోతోంది!

image

ఒకప్పుడు ఆశలు, అవకాశాలకు కేంద్రంగా ఉన్న ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ బెంగళూరు ఇప్పుడు కళ తప్పుతోంది. భారీ ట్రాఫిక్ జామ్స్, మౌలిక సదుపాయాలు క్షీణించడం, ఖర్చులు పెరగడం నగర జీవితాన్ని దుర్భరం చేశాయి. ఇక్కడి ప్రజల జీవితంలో ఏడాదికి సగటున 134 గంటలు ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. దీంతో చాలామంది వివిధ నగరాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు HYDలోనూ పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ పెరిగిపోయింది.