News March 22, 2024

గ్రూప్1 దరఖాస్తుల ఎడిట్‌కు ఛాన్స్: TSPSC

image

TG: గ్రూప్1 అభ్యర్థులు తాము చేసుకున్న దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు TSPSC అవకాశం కల్పించింది. రేపటి నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తుల్లోని వ్యక్తిగత వివరాలు సవరించుకోవచ్చని పేర్కొంది.

Similar News

News November 26, 2025

2033 నాటికి 150 లక్షల టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం

image

AP: పాల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 2033 నాటికి తొలి 3 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని.. 2033 నాటికి దీన్ని 150 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.

News November 26, 2025

దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి: రాష్ట్రపతి

image

భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి. 25Cr మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అతిపెద్ద ఘనత. ఆర్థిక ఏకీకరణలో భాగంగా GST తీసుకొచ్చాం. మహిళా సాధికారిత కోసం ట్రిపుల్ తలాక్ తీసేశాం. Art370ని రద్దు చేశాం’ అని చెప్పారు.

News November 26, 2025

సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.