News September 13, 2024

జగన్ నామజపం మాని ప్రజల బాగోగులపై దృష్టిపెట్టండి చంద్రబాబూ: వైసీపీ చీఫ్

image

AP: గోబెల్స్‌కు తమ్ముడులాంటి వ్యక్తి చంద్రబాబు అని, అబద్ధాన్ని కూడా అమ్మగలిగే టాలెంట్ ఆయన సొంతమని YCP చీఫ్ జగన్ విమర్శించారు. వరదలను ఎలా మేనేజ్ చేయాలో ఈ సర్కారుకు తెలియదన్నారు. పిఠాపురంలో పర్యటించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. ఇప్పటికీ ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమని CBN అంటున్నారు. ఆయన జగన్ నామజపం మాని ప్రజలకు మంచి చేయడంపై దృష్టిపెట్టాలి’ అని సూచించారు.

Similar News

News December 5, 2025

TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

image

TG: ఇన్‌సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్‌కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్‌ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్‌ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.

News December 5, 2025

ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌లోని <>ESIC<<>> మెడికల్ కాలేజీ& హాస్పిటల్ 67 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 10, 17తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, మహిళలు, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 5, 2025

13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

image

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్‌ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్‌‌తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.