News August 21, 2024
చాందీపురా వైరస్.. 28మంది చిన్నారులు మృతి

చాందీపురా <<13646193>>వైరస్<<>> బారిన పడి గుజరాత్లో ఇప్పటివరకు 28 మంది చిన్నారులు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిశికేశ్ పటేల్ తెలిపారు. జులైలో తొలి కేసు నమోదవ్వగా మరణించిన వారంతా 14 ఏళ్ల లోపేనని చెప్పారు. మెదడువాపు సంబంధిత వైరస్తో ఇప్పటివరకు 101 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వారం రోజులుగా ఎలాంటి కేసులు నమోదవ్వలేదన్నారు.
Similar News
News January 20, 2026
నితిన్ నబీన్కు ₹3.06 కోట్ల ఆస్తి, ₹56 లక్షల అప్పు

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ ఆస్తులు, అప్పుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు ₹3.06 CR, అప్పులు ₹56L పైగా ఉన్నాయి. తనూ, తన భార్య దీప్ మాలా పేరున బ్యాంకుల్లో ₹60వేల నగదు, ₹98 లక్షల మేర డిపాజిట్లు ఉన్నాయి. నబీన్ ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. భార్య నవీరా ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్గా ఉన్నారు.
News January 20, 2026
హ్యాపీగా ఉండాలంటే ఈ ఆహారం తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందట. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.
News January 20, 2026
27న అఖిలపక్ష భేటీ.. అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 27వ తేదీన అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ భేటీకి హాజరుకావాలని లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు పంపింది. పార్లమెంట్ సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ భేటీలో కోరనుంది. పార్లమెంట్లో చర్చించే అంశాలు, బిల్లుల వివరాలను విపక్షాలకు అందజేయనుంది. కాగా JAN 28 నుంచి <<18812112>>బడ్జెట్ సమావేశాలు<<>> ప్రారంభం కానున్నాయి.


