News April 4, 2024

ఈ దుస్థితికి చంద్రబాబే కారణం: సజ్జల

image

AP: వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేశ్‌తో ఫిర్యాదు చేయించారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన వల్ల వృద్ధులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ ఏదోక కారణంతో TDP నేతలు ECకి ఫిర్యాదులు చేస్తున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

Similar News

News December 23, 2025

HYD: ఆస్తిపన్ను వడ్డీపై 90% రాయితీ అందుకే!

image

2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుతో పాటు పేరుకుపోయిన పాత బకాయిలు చెల్లించే వారికి GHMC బకాయిల వడ్డీలపై 90% రాయితీ ప్రకటించింది. గతంలో ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో అధికారులు మరోసారి దీన్ని ప్రవేశపెట్టారు. 2022-23లో రూ.170 కోట్లు, 2023- 24లో రూ.320 కోట్లు, 2024-25లో రూ.466 కోట్లుగా పెరుగుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ సదుపాయం ఉంటుంది.
# SHARE IT

News December 23, 2025

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే: పేటీఎం CEO

image

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటనే ప్రశ్నకు పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘మర్చంట్ పేమెంట్ QR కోడ్’ ఇండియా తర్వాతే ప్రపంచమంతా ప్రారంభమైందని చెప్పారు. చైనాలోనూ కన్జూమర్ QR కోడ్ మాత్రమే ఉండేదని.. మన దగ్గర వ్యాపారులే ఈ టెక్నాలజీ వాడి విప్లవం తెచ్చారన్నారు. చిల్లర కష్టాలు తీర్చిన ఈ వ్యవస్థ భారత్ గర్వించదగ్గ ఇన్నోవేషన్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News December 23, 2025

జామఆకులతో మొటిమలకు చెక్

image

సీజనల్‌గా దొరికే జామకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలిసిందే. కానీ.. జామకాయలే కాదు వాటి ఆకులూ మనకి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకులను పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. జామలోని విటమిన్-సి మొటిమలకు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గిస్తాయి.