News September 24, 2024

ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబే: వైసీపీ

image

AP: లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబేనని YCP ట్వీట్ చేసింది. ‘TTDలో 6 నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. మార్చి 12, 2024న టెండర్లు పిలిచారు. మే 8న ఫైనలయ్యాయి. అప్పుడు ఎన్నికల కోడ్‌ నడుస్తోంది. టెండర్‌ దక్కించుకున్న AR డెయిరీ జూన్‌ 12 నుంచి సప్లై చేస్తోంది. జులై 6, 7 తేదీల్లో ట్యాంకర్లను అనలైజ్‌ చేసి ల్యాబ్‌కు పంపారు. ఇదంతా CBN హయాంలోనే జరిగింది’ అని పేర్కొంది.

Similar News

News November 26, 2025

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.

News November 26, 2025

మూవీ అప్డేట్స్

image

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటిస్తారని టాక్.

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.