News September 24, 2024

ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబే: వైసీపీ

image

AP: లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబేనని YCP ట్వీట్ చేసింది. ‘TTDలో 6 నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. మార్చి 12, 2024న టెండర్లు పిలిచారు. మే 8న ఫైనలయ్యాయి. అప్పుడు ఎన్నికల కోడ్‌ నడుస్తోంది. టెండర్‌ దక్కించుకున్న AR డెయిరీ జూన్‌ 12 నుంచి సప్లై చేస్తోంది. జులై 6, 7 తేదీల్లో ట్యాంకర్లను అనలైజ్‌ చేసి ల్యాబ్‌కు పంపారు. ఇదంతా CBN హయాంలోనే జరిగింది’ అని పేర్కొంది.

Similar News

News September 24, 2024

జియో సరికొత్త ప్లాన్

image

టెలికం దిగ్గజం జియో సరికొత్త ప్లాన్‌ను యూజర్ల కోసం తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో ఉండే ఈ ప్లాన్‌ను రూ.999కు అందిస్తోంది. ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMSలు పంపవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. రీఛార్జ్ ధరలు పెంచి జియో ఇప్పటికే వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

News September 24, 2024

రాజ్యసభలో తగ్గుతోన్న వైసీపీ బలం

image

రాజ్యసభలో వైసీపీ బలం తగ్గిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 11 నుంచి 8కి పడిపోయింది. ఇటీవల ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా ఆర్.కృష్ణయ్య సైతం పార్టీని వీడారు. మరికొంత మంది కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.

News September 24, 2024

విడాకుల ధోరణి పెరగడానికి అదే కారణం: ఆశా భోస్లే

image

ప్రేమ లేకపోవడమే యువ జంటల్లో విడాకులకు కారణమని ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోస్లే అన్నారు. ఓ కార్య‌క్ర‌మంలో ఆధ్యాత్మిక గురు రవిశంకర్‌తో మాట్లాడుతూ ‘నేను సినిమా పరిశ్రమలో చాలా ఏళ్లు గ‌డిపాను. ప్రస్తుత తరంలాగా గ‌తంలో ఎవ‌రూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. యువ జంట‌ల్లో త్వ‌ర‌గా ప్రేమ లేకుండాపోతోందని భావిస్తున్నా. ఒకరితో ఒకరు విసుగు చెందుతున్నారు. ఇదే విడాకులు పెర‌గ‌డానికి ఒక కార‌ణం’ అని పేర్కొన్నారు.