News February 24, 2025

అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

image

AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. కాసేపట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా రోజుల తర్వాత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.

Similar News

News October 15, 2025

విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్

image

కరూర్ సభకు టీవీకే చీఫ్ విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ర్యాలీకి వచ్చినవారికి టీవీకే పార్టీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని సీఎం ఆరోపించారు. అటు ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు.

News October 15, 2025

కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి

image

కేరళ(కొచ్చి)లోని ఆయుర్వేద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెన్యా మాజీ PM రైలా ఒడింగా(80) గుండెపోటుతో మరణించారు. ఉదయం ఆసుపత్రి ఆవరణలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ఉ.9.52కు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఒడింగా మృతిపై FRROకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. 2008-13 కాలంలో ఆయన కెన్యా PMగా వ్యవహరించారు.

News October 15, 2025

ఆన్‌లైన్ వేధింపులు ఎలా ఎదుర్కోవాలంటే?

image

టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ డిజిటల్ ప్రపంచంలో మోసాలు, మహిళలపై వేధింపులూ పెరుగుతున్నాయి. ఈ విషవలయంలో అతివలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. తెలిసినవారేనని ఫొటోలు, వీడియోలు పంపకూడదు. పాస్‌వర్డ్‌లు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. థర్డ్‌పార్టీ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ఆఫ్‌ చేసి ఉంచాలి. సైబర్‌ నేరాల బాధితులైతే సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి డయల్‌ చేయాలని సూచిస్తున్నారు.