News June 6, 2024
పార్టీ నేతలతో నేడు చంద్రబాబు, పవన్ చర్చలు

AP: టీడీపీ సీనియర్ నేతలతో నేడు చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇటు ఇదే అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి వారి అభిప్రాయాలను పవన్ తీసుకోనున్నారు.
Similar News
News September 11, 2025
నిజమైన ‘శ్రీమంతుడు’!

మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ ద్వారా 10వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్లు అందించారు. ఒంటరి మహిళలు & వృద్ధులు ఉంటే రూ.5వేలు పంపిణీ చేశారు. అలాగే పశువులకు వైద్యం అందించి మెడిసిన్స్, ఫుడ్స్ ఇస్తున్న అనంత్ నిజమైన శ్రీమంతుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
News September 11, 2025
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్

AP: ఈనెల 20లోపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు పేర్కొంది. రిలీజ్ చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంది. అటు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోతే కాలేజీలు <<17653923>>బంద్<<>> చేస్తామని ఇటీవల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరించాయి.
News September 11, 2025
నేపాల్ నిరసనలకు ముఖ్య కారణం ఇతడేనా?

నేపాల్ ఆందోళనలకు Hami Nepal అనే NGO ప్రెసిడెంట్ సుడాన్ గురుంగ్ ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 2015లో భూకంపం తర్వాత ఈ NGOను స్థాపించారు. దీనికి అమెరికా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాపై బ్యాన్ విధించే ఒకరోజు ముందు (SEP 8న) ఎలా నిరసన చేయాలో చెబుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దీంతో నేపాల్ ప్రభుత్వ మార్పు వెనుక US ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.