News March 20, 2024

చంద్రబాబు, పవన్‌ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: బొండా ఉమ

image

AP: పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. నరేందర్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు నిరంతరం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా ఉంచారని తెలిపారు. సీఎం జగన్, సజ్జల, పెద్దిరెడ్డిల ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఫైరయ్యారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామని బొండా చెప్పారు.

Similar News

News January 26, 2026

PHOTO GALLERY: అమరావతిలో రిపబ్లిక్ డే

image

AP: రాజధాని అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్‌లో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసుల కవాతు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వర్ణ పంచాయతీ- స్వచ్ఛ పంచాయతీ, స్వచ్ఛాంధ్ర, పర్యాటక, ఉద్యానవన శాఖ, అమరావతి‌, ఐటీ శకటాలు అబ్బురపరిచాయి.

News January 26, 2026

గోవిందాపై భార్య సునీత సంచలన కామెంట్స్

image

స్టార్ హీరో గోవిందాపై భార్య సునీతా అహుజా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన అఫైర్స్ రూమర్స్‌ను పరోక్షంగా కన్ఫర్మ్ చేసిన ఆమె 63 ఏళ్ల వయసులో ఇలాంటివి తగదని సూచించారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని.. వాళ్లు డిస్టర్బ్ అవుతారన్నారు. ‘హీరోయిన్ అవ్వలేని కొంతమంది అమ్మాయిలు స్టార్లను ట్రాప్ చేసి తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తారు. మరి మీ బుద్ధి ఏమైంది’ అంటూ గోవిందా పేరు ఎత్తకుండా ఆయన్ని ప్రశ్నించారు.

News January 26, 2026

అదనంగా మరో 50 వేల గ్రీన్ కార్డులు!

image

అగ్రరాజ్యం అమెరికా 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ను ఇటీవల <<18861240>>నిలిపివేసిన <<>>విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 2027లో గ్రీన్‌కార్డు కోటా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ 175 దేశాలకు ఏడాదికి సుమారు 67 వేల ఇమిగ్రెంట్ వీసాలు జారీ అవుతాయి. అయితే ప్రాసెసింగ్ నిలిచిపోవడంతో వినియోగం కాని కోటా మిగిలే పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చే ఏడాదికి అదనంగా దాదాపు 50 వేల గ్రీన్‌కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.