News June 28, 2024
త్వరలో ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి

AP, TG CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలిసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. జులై 3వ వారంలో HYDలోని HICCలో జరిగే ప్రపంచ కమ్మ మహాసభ కార్యక్రమంలో CMలు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో TDPలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరి తెలంగాణ CM అయ్యారు. చాలాకాలం తర్వాత ఇరువురిని ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 20, 2025
‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
News December 20, 2025
SHAR: 24న ఉదయం 8.54 గంటలకు..

AP: మరో శాటిలైట్ ప్రయోగానికి SDSC SHAR సిద్ధమైంది. ఈనెల 24న 8.54amకు LVM3-M6 రాకెట్ ప్రయోగాన్ని జరిపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. USకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్–6ను నింగిలోకి పంపనున్నారు. ఈ నెల 15న, 21న ప్రయోగం చేయాలనుకున్నా సాంకేతిక కారణాలతో కుదరలేదు. అటు ఈ ప్రయోగాన్ని SHAR గ్యాలరీల నుంచి చూడాలనుకునే వారు <
News December 20, 2025
ధనుర్మాసం: ఐదోరోజు కీర్తన

మధురా నగరంలో, యమునా తీరంలో జన్మించిన కృష్ణుడు అద్భుత గుణాలు కలవాడు. గొల్ల కులాన్ని తన రాకతో ప్రకాశింపజేశాడు. యశోద గర్భానికి వెలుగునిచ్చిన ఆయనను మనం పవిత్రమైన మనసుతో శరణు వేడాలి. ఏ కోరికలు కోరక స్వామిని భక్తితో పూజించాలి. ఆయన కల్యాణ గుణాలను గానం చేయాలి. ఫలితంగా మన పాపాలు పోతాయి. రాబోవు దోషాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మమవుతాయి. సర్వపాప హరుడైన ఆ పరమాత్మ నామస్మరణను ఎప్పుడూ మరువకూడదు. <<-se>>#DHANURMASAM<<>>


