News June 28, 2024
త్వరలో ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి

AP, TG CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలిసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. జులై 3వ వారంలో HYDలోని HICCలో జరిగే ప్రపంచ కమ్మ మహాసభ కార్యక్రమంలో CMలు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో TDPలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరి తెలంగాణ CM అయ్యారు. చాలాకాలం తర్వాత ఇరువురిని ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 17, 2025
భారత్పై పాకిస్థాన్ విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో ఇండియా-Aపై పాకిస్థాన్-A విజయం సాధించింది. IND-A నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్ 4 సిక్సులు, 7 ఫోర్లతో 79* పరుగులు చేశారు. యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. కాగా టాస్ సమయంలో పాక్ కెప్టెన్కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ <<18306948>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం గమనార్హం.
News November 17, 2025
పాలనలో తెలుగును ప్రోత్సహించాలి: వెంకయ్య

భాష పోతే మన శ్వాస పోయినట్లేనని, తెలుగు పోతే మన వెలుగు పోయినట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. అదే సమయంలో హిందీని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. మన ఎదుగుదలకు హిందీ కూడా ఎంతో అవసరమని తెలిపారు. రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. పాలనలో తెలుగును ప్రోత్సహించాలని, అన్ని ఆదేశాలూ తెలుగులోనే ఇచ్చేలా చొరవ తీసుకోవాలి AP, TG సీఎంలను కోరారు.


