News January 5, 2025

రాజీవ్ బాటను చంద్రబాబు, YS కొనసాగించారు: రేవంత్

image

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఐటీని పరిచయం చేశారని CM రేవంత్ అన్నారు. రాజీవ్ వేసిన బాటను చంద్రబాబు, YS కొనసాగించారని తెలిపారు. ఐటీ, ఫార్మాలో తెలుగువారి గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. చంద్రబాబు ఐటీకి పెద్దపీట వేసి సైబరాబాద్ నిర్మిస్తే, వైఎస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విమానాశ్రయం సమీపంలో ఫోర్త్ సిటీ నిర్మిస్తుందని తెలుగు సమాఖ్య మహాసభల్లో వివరించారు.

Similar News

News December 10, 2025

కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

image

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.

News December 10, 2025

రాష్ట్రంలో పరువు హత్య!

image

TG: హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో పరువు హత్య కలకలం రేపింది. బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అది ఇష్టం లేని యువతి పేరెంట్స్ అతడిని నిన్న హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అనంతరం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వారే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 10, 2025

పోలింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం.. 890 పంచాయతీలు ఏకగ్రీవం

image

TG: రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రెస్‌మీట్లో తెలిపారు. తొలి, రెండో విడతల్లో 890 గ్రామాల్లో ఏకగ్రీవమైనట్లు చెప్పారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.8.2Cr సీజ్ చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు చేపట్టిందని తెలిపారు. 50వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నట్లు వెల్లడించారు.