News August 24, 2025

సంపన్న సీఎంగా చంద్రబాబు.. ఎలా అంటే?

image

చంద్రబాబు 1992లో రూ.7వేల పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్థాపించారు. 1994లో IPOకు వెళ్లగా రూ.6.5 కోట్లు సమకూరాయి. 1995లో దీని మార్కెట్ వాల్యూ రూ.25 కోట్లు ఉండగా 2025లో రూ.4,500 కోట్లకు చేరింది. చంద్రబాబు 1994లో మంత్రి కాగానే తన భార్య భువనేశ్వరికి హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. దీన్ని చంద్రబాబు సంపదగా పరిగణించడంతో ఆయన దేశంలో అత్యంత <<17489958>>సంపన్న<<>> CMగా నిలిచారు.

Similar News

News August 24, 2025

DRDO IADWS ప్రయోగం విజయవంతం

image

DRDO ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్(IADWS) ప్రయోగం విజయవంతం కావడంపై సంస్థ, సాయుధ బలగాలను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అభినందించారు. ఇందులో బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి(QRSAM), వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(VSHORADS) మిసైల్స్, లేజర్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. దీంతో వాయు రక్షణ పెరగడంతో పాటు శత్రు వైమానిక ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది.

News August 24, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా

image

పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతీసారి నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించడం మాటల్లో చెప్పలేను. అన్ని మంచి విషయాలు ముగియాల్సిందే. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు!’ అని Xలో రాసుకొచ్చారు. 103 టెస్టుల్లో 7,195, 5 ODIల్లో 51రన్స్ చేశారు. టెస్టుల్లో 206* టాప్ స్కోర్. 2023లో AUSతో చివరి టెస్టు ఆడారు.

News August 24, 2025

వడ మధ్యలో రంధ్రం ఎందుకో తెలుసా?

image

మినప వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. మధ్యలో రంధ్రం లేకుండా ఉడికిస్తే బయటి భాగం త్వరగా వేగి, లోపల పచ్చిగా ఉంటుంది. రంధ్రం పెట్టడం వల్ల దాని ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. వేడి నూనె వడ లోపలి భాగాలను సమానంగా తాకి ఈజీగా డీప్ ఫ్రై అవుతుంది. అంతేకాదు రంధ్రం వల్ల వడ తక్కువ మోతాదులో నూనెను వాడుకుంటుంది. ఆకారం మారకుండా ఉంటుంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా రంధ్రం వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట.