News March 29, 2024
టీడీపీ@42.. శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

AP: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహాశయుల స్ఫూర్తిగా 1982లో NTR పార్టీని స్థాపించారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని.. ప్రజలకు సేవ చేయడమని నేర్పారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ ప్రజల సేవలో నిమగ్నమైంది. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో కృషిచేస్తుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 15, 2025
కామన్వెల్త్ గేమ్స్: ఈ విషయాలు తెలుసా?

కామన్వెల్త్ <<18015617>>క్రీడలు<<>> 1930లో ‘బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్’ పేరుతో కెనడాలోని హామిల్టన్లో తొలిసారి జరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్(1954-1966), బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్(1970-1974)గా మారాయి. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్గా పిలుస్తున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందినవి ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. 2022లో ఇందులో 53 సభ్యదేశాలు ఉండగా 72 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి.
News October 15, 2025
నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CBN

AP: పథకాల అమలుపై నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని CM CBN వెల్లడించారు. ‘సుపరిపాలన అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు, GST సంస్కరణల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులు థియేటర్లలో స్లైడ్స్ ప్రదర్శించాలి. టెక్నాలజీ డేటాను ఆడిట్ చేసి ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటా. అధికారులిచ్చే సమాచారానికి వాస్తవాలకు పొంతన ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీల కుట్రలను టెక్నాలజీతో బయట పెట్టామన్నారు.
News October 15, 2025
గూగుల్ డేటా సెంటర్కు పోల’వరం’!

విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్కు భారీ స్థాయిలో నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1 టీఎంసీ జలాలు అవసరం అవుతాయని అంటున్నారు. అయితే పోలవరం లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా విశాఖకు ఏడాదికి 23.44 TMCల నీరు సరఫరా కానుంది. ఆ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి కానుంది. దీనివల్ల నీటి సమస్య తీరే ఛాన్స్ ఉంది. ఇక గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్.. డేటా సెంటర్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నాయి.