News September 27, 2024

చంద్రబాబూ.. మీ హయాంలో రూ.276కే నెయ్యి ఎలా కొన్నారు?: జగన్

image

AP: నందిని నెయ్యిని YCP హయాంలో కొనుగోలు చేయలేదని, మిగతా కంపెనీల నెయ్యిని తక్కువ ధరకు కొన్నారని చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘CBN హయాంలో 2015-2018 మధ్య నందిని బ్రాండ్‌ను ఎందుకు కొనుగోలు చేయలేదు? 2015లో కేజీ నెయ్యి ధర రూ.276, 2019లో రూ.324కు కొన్నారు. మా హయాంలో రూ.320కి కొంటే తప్పేముంది? ఇప్పుడు హెరిటేజ్ ధరలు పెంచుకోవడానికి CBN ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 7, 2026

రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

AP: రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించింది. ఆ రోజు 6PM నుంచి 12AM లోపు స్పెషల్ షో వేసుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 (GSTతో కలిపి) పెంచుకోవచ్చని పేర్కొంది.

News January 7, 2026

TG ప్రాజెక్టులకు చిల్లు పెట్టడం లేదు కదా: లోకేశ్

image

AP: TGని దాటి వచ్చే గోదావరి నీటినే రాష్ట్ర పరిధిలో తాము వినియోగిస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. నల్లమలసాగర్‌పై TG అభ్యంతరాల పట్ల స్పందిస్తూ ‘అక్కడి ప్రాజెక్టులకు మేం చిల్లు పెట్టడం లేదు కదా? ఆ ప్రాంతం దాటి వచ్చిన నీరు వృథాగా సముద్రంలోకి పోకుండా వాడుకుంటున్నాం. 1 TMC కోసం గతంలో వివాదాలు జరిగాయి. దేశాల మధ్య యుద్ధాలూ జరిగాయి. వేస్ట్‌గా పోయే నీరు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకూ ఇవ్వొచ్చు’ అన్నారు.

News January 7, 2026

ఇక సర్కార్ వంతు.. టికెట్ రేట్ల పెంపు ఉంటుందా?

image

TG: ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘రాజాసాబ్‌’ సినిమాల టికెట్ రేట్ల పెంపుపై నిర్ణయం ప్రభుత్వానిదేనని <<18786947>>హైకోర్టు<<>> స్పష్టం చేయడంతో సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నిర్మాతలు సర్కారుకు ప్రతిపాదనలు పంపడంతో పాటు సీఎంతో చర్చించాకే కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టికెట్ రేట్లు పెంచేది లేదని మంత్రి కోమటిరెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతల్లో అయోమయం నెలకొంది.