News September 27, 2024

చంద్రబాబూ.. మీ హయాంలో రూ.276కే నెయ్యి ఎలా కొన్నారు?: జగన్

image

AP: నందిని నెయ్యిని YCP హయాంలో కొనుగోలు చేయలేదని, మిగతా కంపెనీల నెయ్యిని తక్కువ ధరకు కొన్నారని చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘CBN హయాంలో 2015-2018 మధ్య నందిని బ్రాండ్‌ను ఎందుకు కొనుగోలు చేయలేదు? 2015లో కేజీ నెయ్యి ధర రూ.276, 2019లో రూ.324కు కొన్నారు. మా హయాంలో రూ.320కి కొంటే తప్పేముంది? ఇప్పుడు హెరిటేజ్ ధరలు పెంచుకోవడానికి CBN ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 7వ తరగతి, డిగ్రీ, పీజీ (MSW/MA-రూరల్ డెవలప్‌మెంట్/సోషియాలజీ/సైకాలజీ) BEd ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://centralbank.bank.in/

News December 15, 2025

ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం

image

TG: హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలిచారు. కరీంనగర్ జిల్లాలోనే ఐదుగురు ఇలా సర్పంచ్ పీఠం ఎక్కారు. కొత్తపల్లిలో శోభారాణి, పెద్దూరుపల్లిలో రామడుగు హరీశ్, మహాత్మనగర్‌లో పొన్నాల సంపత్, ముంజంపల్లిలో నందగిరి కనక లక్ష్మి, అంబల్ పూర్‌లో వెంకటేశ్ ఓటు తేడాతో విజయం సాధించారు. వరంగల్(D) ఆశాలపల్లి కొంగర మల్లమ్మ, నల్గొండ(D) ధన్‌సింగ్ తండాలో ధనావత్ కూడా ఇలా గెలిచారు.

News December 15, 2025

సీడ్ పార్కు… 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలు

image

TG: విత్తన ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా సీడ్ రీసెర్చ్ పార్కు నెలకొల్పనుంది. అలాగే కొత్తగా 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 25 లక్షల టన్నుల అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి కోసం ‘Inland seed Export facilitation port’నూ నెలకొల్పనున్నట్లు TG రైజింగ్ డాక్యుమెంట్లో తెలిపింది.