News June 4, 2024
కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం

AP: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో టీడీపీ అధినేత చంద్రబాబు 1,549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాసేపట్లో ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అక్కడ వైసీపీ నుంచి KRJ భరత్ బరిలో ఉన్నారు.
Similar News
News December 20, 2025
గుజరాత్లో SIR.. 73 లక్షల ఓట్లు తొలగింపు

గుజరాత్లో నిర్వహించిన SIRలో 73,73,327 ఓట్లను అధికారులు తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 43.47 కోట్లకు తగ్గిందని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ద్వారా తెలుస్తోంది. అభ్యంతరాలను జనవరి 18, 2026లోగా తెలియజేయాలి. వాటిని ఫిబ్రవరి 10లోగా అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. తొలగించిన ఓట్లలో 18 లక్షల మంది మరణించిన వారివి కాగా శాశ్వతంగా నివాసం మారిన ఓట్లు 40 లక్షలుగా గుర్తించారు.
News December 20, 2025
T20ల్లో తిరుగులేని జట్టుగా టీమ్ఇండియా!

టీ20 సిరీసుల్లో భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా SAపై సిరీస్ గెలుపుతో IND వరుసగా 8వ ద్వైపాక్షిక T20 సిరీస్ను సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్ నుంచి ఇది కొనసాగుతోంది. మొత్తంగా భారత్ వరుసగా 14 సిరీస్లు(ద్వైపాక్షిక+ టోర్నమెంట్లు) గెలిచింది. ఇందులో 2023 ఏషియన్ గేమ్స్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ కూడా ఉన్నాయి. టీమ్ఇండియా చివరిసారి 2023 ఆగస్టులో WIపై 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
News December 20, 2025
డిసెంబర్ 20: చరిత్రలో ఈరోజు

1934: వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం
1940: శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి జననం (ఫొటోలో)
1951: కథారచయిత కన్నేపల్లి చలమయ్య జననం
1988: సినీ నటి బి.జయమ్మ మరణం
☛ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం


