News May 18, 2024

అల్లర్లకు చంద్రబాబే బాధ్యుడు: జోగి

image

AP: ఓటమి భయంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. ‘ఎన్నికలు ముగిసినా వైసీపీ నేతలపై దాడులు ఆగటం లేదు. ప్రణాళికా బద్ధంగా మా పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు. అల్లర్లు, దాడులకు చంద్రబాబే బాధ్యుడు. ఫలితాల తర్వాత బాబు పారిపోవటం ఖాయం’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News October 27, 2025

పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

News October 27, 2025

ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

image

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్‌ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్‌కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News October 27, 2025

అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

image

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం