News September 22, 2024

నెయ్యిలో కల్తీ జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అంబటి

image

AP: దైవాన్ని అడ్డుపెట్టుకుని CM చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే నెయ్యిని టెస్ట్ చేశారు. అందులో కల్తీ జరిగితే దానికి చంద్రబాబుదే బాధ్యత. జగన్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఎప్పుడూ వారి ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని CM గుర్తుపెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News March 11, 2026

రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

image

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.

News March 11, 2026

GAILలో 70 పోస్టులు.. మార్చి 18 చివరి తేదీ

image

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com

News March 11, 2026

జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

image

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.