News September 22, 2024
నెయ్యిలో కల్తీ జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అంబటి

AP: దైవాన్ని అడ్డుపెట్టుకుని CM చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే నెయ్యిని టెస్ట్ చేశారు. అందులో కల్తీ జరిగితే దానికి చంద్రబాబుదే బాధ్యత. జగన్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఎప్పుడూ వారి ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని CM గుర్తుపెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 10, 2025
వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.
News December 10, 2025
వారికి త్వరగా పరిహారం అందాలి: D-HC

ఇండిగో ఫ్లైట్ల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు వీలైనంత త్వరగా పరిహారం అందించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ‘ఎయిర్పోర్టుల్లో పడిగాపులున్న ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ, DGCA, ఇండిగో వీలైనంత త్వరగా పరిహారం అందిస్తాయని ఆశిస్తున్నాం’ అని ఇవాళ విచారణలో పేర్కొంది. అంతకుమందు కేంద్రం సరిగా స్పందించకే ప్రజలు ఇబ్బంది పడ్డారని <<18521287>>HC ఏకిపారేసిన<<>> విషయం తెలిసిందే.
News December 10, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in


