News August 19, 2024

నేడు శ్రీసిటీకి సీఎం చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో నేడు పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. సీఎంవో వివరాల ప్రకారం ఉండవల్లి నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీసిటీకి చేరుకుని పలు పరిశ్రమల్ని ప్రారంభిస్తారు. 7 కొత్త సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అనంతరం మధ్యాహ్నం నెల్లూరులోని సోమశిలకు చేరుకుని జలాశయాన్ని పరిశీలిస్తారు.

Similar News

News January 9, 2026

ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

image

ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్‌లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.

News January 9, 2026

మళ్లీ పెరిగిన బంగారం ధర!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.1,310 పెరిగి రూ.1,39,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.1,27,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 9, 2026

మోదీ, ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారు: విదేశాంగ శాఖ

image

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి మోదీ <<18806375>>ఫోన్ చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ‘వాణిజ్య ఒప్పందంపై గతేడాది ఫిబ్రవరి నుంచి 2 దేశాలు చర్చలు జరిపాయి. చాలాసార్లు మేం డీల్‌కు చేరువయ్యాం. చర్చలపై తాజాగా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. గతేడాది మోదీ, ట్రంప్ 8సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు.