News June 6, 2024

కాసేపట్లో TDP ఎంపీలతో చంద్రబాబు భేటీ

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో నూతనంగా ఎన్నికైన తమ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈమేరకు ఉండవల్లిలోని తన నివాసానికి ఎంపీలను ఆహ్వానించారు. రేపు ఎన్డీయే భేటీలో ఎంపీలతో కలిసి పాల్గొననున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి సైతం టీడీపీ ఎంపీలు హాజరు కానున్నారు.

Similar News

News October 22, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

image

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.

News October 22, 2025

శివకాశి రికార్డు.. రూ.7వేల కోట్ల బిజినెస్

image

దేశ బాణసంచా రాజధాని శివకాశి(TN) రికార్డు సృష్టించింది. ఈ దీపావళి సీజన్లో రూ.7వేల కోట్ల బిజినెస్ జరిగిందని, 2024 కంటే రూ.1,000 కోట్లు అధికమని ఫైర్ వర్క్ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. శివకాశిలో వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే బాణసంచాలో 90% ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. రిటైల్ మార్కెట్లో కంటే తక్కువ ధర ఉండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు.

News October 22, 2025

కార్తీక మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యం

image

కార్తీక మాసం నదీ స్నానాలు, దీపారాధనతోనే కాక నియమ నిష్ఠలతో కూడిన వ్రతాల ద్వారా కూడా ఎంతో పుణ్యాన్నిస్తుంది. ఈ నెల రోజుల్లో శివకేశవులను పూజించడం శ్రేయస్కరం. దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల మోక్షం లభిస్తుంది. శక్తి ఉన్నవారు ఉపవాసం ఆచరించాలి. సోమవారాలతో పాటు పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రుద్రాభిషేకాలు, తులసి పూజ, కార్తీక పురాణ పారాయణం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం.