News December 25, 2024

చంద్రబాబు చెత్తతో సంపద సృష్టించారు: నిమ్మల

image

AP: జగన్ అధికారంలోకి రాగానే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లోని రూ.2,092 కోట్లను దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. చెత్తపై పన్ను వేసిన చెత్త పాలన ఆయనదని విమర్శించారు. 45L మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారన్నారు. CM చంద్రబాబు చెత్తతో సంపద సృష్టించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని తెలిపారు. వ్యవసాయ రాష్ట్రంగా APని మార్చేందుకు CM కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

image

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.

News December 10, 2025

వివేకా హత్యకేసులో కోర్టు కీలక ఆదేశాలు

image

TG: వివేకా హత్యకేసులో పలు అంశాలపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని CBIని నాంపల్లి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో కేసును మళ్లీ విచారించాలని సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు కోర్టు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి కాల్ రికార్డింగుల ఆధారంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

News December 10, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలి.. TSUTF డిమాండ్

image

TG: నిన్న విద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి ఎగ్జామ్స్ <<18515127>>షెడ్యూల్‌పై<<>> తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(TSUTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 7 పేపర్లను 35 రోజుల పాటు నిర్వహించడం సరికాదంది. అశాస్త్రీయంగా రూపొందించిన SSC టైమ్ టేబుల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.