News March 18, 2025
రేపు బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరుకానున్నారు. రేపు ఆయన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్గేట్స్తో భేటీ కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. రేపు సాయంత్రం CBN తిరిగి అమరావతికి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.
Similar News
News December 4, 2025
సల్మాన్ ఖాన్ రాక.. కీరవాణి రాగం

TG గ్లోబల్ సమ్మిట్కు సినీ గ్లామర్ తోడవనుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సదస్సుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. సినీ ఇండస్ట్రీపై చర్చలో ఆయన పాల్గొంటారు. అటు ఈవెంట్ మొదట్లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కన్సర్ట్ ఉండనుంది. సుమారు గంటన్నరపాటు ఆయన తన సంగీతంతో ఆకట్టుకోనున్నారు. బంజారా, కోలాటం, గుస్సాడీ, భారతనాట్యం వంటి కల్చరల్ ప్రోగ్రామ్లు అతిథులను అలరించనున్నాయి.
News December 4, 2025
గుర్తింపు, పదవుల కోసం పాకులాడను: పవన్

AP: నిస్సహాయులకు అండగా నిలబడటమే నాయకుడి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరులో కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తాను గుర్తింపు, పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ప్రయాణంలో పదవి వస్తే అలంకారం కాదు బాధ్యత అని నమ్ముతానన్నారు. అదృష్టవశాత్తు తన పేషీలోని అధికారులు కూడా సమాజానికి మంచి చేద్దాం అనే తపన ఉన్నవాళ్లేనని పేర్కొన్నారు.
News December 4, 2025
మన రూపాయికి విలువే లేదు: ఖర్గే

డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల <<18465153>>కనిష్ఠ స్థాయి<<>>కి చేరడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రూపాయి క్షీణిస్తోందని ఆరోపించారు. ‘కేంద్రం విధానాలు మన కరెన్సీని బలహీనపరిచాయి. అవే బాగుంటే రూపాయి పైకి ఎగిసేది. మన ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మనల్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ప్రపంచంలో మన రూపాయికి విలువే లేదు’ అని ఫైరయ్యారు.


