News March 20, 2025
YSR పేరు వింటే చంద్రబాబుకు వణుకు: YCP

AP: దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ ఈ లోకాన్ని వీడి 16 ఏళ్లు అయినా, ఇప్పటికీ ఆయన పేరు వింటే సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని వైసీపీ ట్వీట్ చేసింది. ఆ భయంతోనే ఇప్పుడు విశాఖపట్నంలో వైఎస్ఆర్ గుర్తులను చెరిపేసేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. విశాఖపట్నం స్టేడియానికి YSR పేరును తొలగించడంపై ఇవాళ ధర్నా చేస్తున్నట్లు వెల్లడించింది.
Similar News
News November 13, 2025
340పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BE, B.Techలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన, 25ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 13, 2025
ECGC లిమిటెడ్లో 30 పోస్టులు

<
News November 13, 2025
సీఎం, పీఎంను తొలగించే బిల్లు.. జేపీసీలో మన ఎంపీలకూ చోటు

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై కేంద్రం <<18272673>>ఏర్పాటు<<>> చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం లభించింది. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డికి చోటు దక్కింది. కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించాయి.


