News March 30, 2025
చంద్రబాబు ఆరోసారీ సీఎం అవుతారు: నాగఫణి శర్మ

AP: చంద్రబాబు ఆరోసారి కూడా రాష్ట్రానికి సీఎం అవుతారని మాడుగుల నాగఫణి శర్మ జోస్యం చెప్పారు. AP ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. అమరావతిని ఎవరూ కదిలించలేరని శర్మ ఈ సందర్భంగా తెలిపారు. ‘అమరావతి విశ్వనగరం అవుతుంది. ఎవరికైనా పదవులు రాకపోయినా కంగారుపడొద్దు. ఆలస్యమైనా అర్హత ఉన్నవారందరికీ పదవులు దక్కుతాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


