News April 8, 2025
‘ఆక్వా’కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు: ఆనం

AP: CM చంద్రబాబు ఆక్వా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని TDP సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ‘త్వరలోనే బాబు ఢిల్లీకి వెళ్లి వాణిజ్యమంత్రిని కలుస్తారు. US సుంకాల కారణంగా ఆక్వా సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చైనా, థాయ్లాండ్కు ఎగుమతి చేసే మార్గాన్ని పరిశీలించాలని సూచించారు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు

మరో రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైందని AICTE ఛైర్మన్ సీతారాం తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లోమా, డిగ్రీ కోర్సుల మొదటి, రెండో సంవత్సరాల కోసం 600 పుస్తకాలు సిద్ధమైనట్లు తెలిపారు. 3, 4వ సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాలను అనువదించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
News April 8, 2025
నేడు భారత్కు వస్తున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మఖ్తూమ్ రెండు రోజుల పర్యటన కోసం నేడు భారత్ వస్తున్నారు. రెండు దేశాల మధ్య ట్రేడ్, వ్యూహాత్మక సంబంధాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు. యువరాజు హోదాలో ఇది ఆయన తొలి భారత పర్యటన. ఇటీవల అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే.
News April 8, 2025
రేషన్ లబ్ధిదారులకు షాక్

TG: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం తీసుకుందామనుకున్న రేషన్ లబ్ధిదారులకు డీలర్లు షాకిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో షాపులు ఓపెన్ చేయడం లేదు. మిగతా చోట్ల టైం పాటించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ షాపులు ఎప్పుడు తీస్తారోనని లబ్ధిదారులు వాటి చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు దీనిపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. మీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందా?