News May 4, 2024

నేడు కాకినాడలో చంద్రబాబు-పవన్ ఉమ్మడి ప్రచారం

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు దర్శి, మధ్యాహ్నం 3 గంటలకు నూజివీడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడ రూరల్, సిటీ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

Similar News

News January 22, 2026

గిల్ డకౌట్.. సర్ఫరాజ్ సెంచరీ

image

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం రంజీ ట్రోఫీలో ఆడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ నిరాశపరిచారు. సౌరాష్ట్రతో మ్యాచులో ఈ పంజాబ్ బ్యాటర్ 2 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ అయ్యారు. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ హైదరాబాద్‌పై సెంచరీ బాదారు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

News January 22, 2026

భారత్‌లో T20 WC ఆడేదే లేదు: బంగ్లాదేశ్

image

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. తమకు WC ఆడాలని ఉందని, అయితే ఇండియాలో కాదని తెలిపింది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ఒప్పుకోని విషయం తెలిసిందే. భారత్‌లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ BCB తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది.

News January 22, 2026

నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

image

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.