News March 26, 2025
పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 19, 2025
నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ నంబర్-1 స్థానాన్ని కోల్పోయారు. కివీస్ బ్యాటర్ మిచెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, హిట్ మ్యాన్(781) సెకండ్ ప్లేస్లో నిలిచారు. NZ తరఫున ODIలలో టాప్ ర్యాంక్ సాధించిన రెండో బ్యాటర్గా మిచెల్ రికార్డు సాధించారు. చివరిసారిగా 1979లో టర్నర్ నం.1 అయ్యారు. ఇక 3-10 స్థానాల్లో జోర్డాన్, గిల్, కోహ్లీ, బాబర్, టెక్టర్, అయ్యర్, అసలంక, హోప్ ఉన్నారు.
News November 19, 2025
GHMC ఎన్నికల్లో జనసేన పోటీ!

తెలంగాణ రాజకీయాలపై జనసేన పార్టీ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు. కూకట్పల్లి నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్గౌడ్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
News November 19, 2025
హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టు!

AP: మావోయిస్టు అగ్రనేత హిడ్మా నిన్న ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడం తెలిసిందే. అయితే ఆయన అనుచరుడు మద్వి సరోజ్ కోనసీమ(D) రావులపాలెంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చేపట్టి ఈరోజు అరెస్టు చేశారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారని సమాచారం. కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చాడు? ఎప్పటినుంచి ఉంటున్నాడు? తదితరాలపై ఆరా తీస్తున్నారు.


