News March 26, 2025
పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 17, 2025
శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి: iBOMMA

ఐ-బొమ్మ వెబ్సైట్లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. ఇటీవల <<18309765>>పోలీసులు<<>> మూవీ పైరసీ చేస్తున్న iBOMMA గుట్టురట్టు చేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు.
News November 17, 2025
శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి: iBOMMA

ఐ-బొమ్మ వెబ్సైట్లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. ఇటీవల <<18309765>>పోలీసులు<<>> మూవీ పైరసీ చేస్తున్న iBOMMA గుట్టురట్టు చేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు.
News November 17, 2025
ఈ మాస్క్తో అవాంఛిత రోమాలకు చెక్

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వంశపారంపర్యం, హార్మోన్ల అసమతుల్యత, పలు అనారోగ్యాలు, కొన్ని మందులు వాడటం వల్ల ఇవి వస్తాయి. వీటిని తగ్గించాలంటే స్పూన్ జెలటిన్ పొడి, పాలు, తేనె, పసుపు కలిపి క్లీన్ చేసిన ముఖానికి అప్లై చేసుకోవాలి. కనుబొమ్మలు, కంటికి అంటకుండా మాస్క్ వేయాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా తొలగించాలి. తర్వాత ఐస్ క్యూబ్స్తో ముఖాన్ని రుద్ది మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది.


