News November 13, 2024

చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలి: జగన్

image

AP: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగితే, తాను సీఎంగా ఉన్న కాలంలో 15శాతం మాత్రమే పెరిగినట్లు YS జగన్ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లు, రూ.14లక్షల కోట్ల అప్పు అని తమపై తప్పుడు ప్రచారం చేసి, బడ్జెట్‌లో రూ.6లక్షల కోట్ల అప్పు మాత్రమే చూపించారని ఆరోపించారు. అంటే చంద్రబాబు, కూటమి నేతలు చేసిందంతా తప్పుడు ప్రచారం కాదా? అని ప్రశ్నించారు. అప్పు రత్న అనే బిరుదును చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు.

Similar News

News October 28, 2025

తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా: YCP

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించట్లేదని YCP ఆరోపిస్తోంది. ‘మంత్రి కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనే పునరావాస కేంద్రాలు కనిపించట్లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా? విజయనగరం జిల్లా గుర్లలో తుఫానుతో వరి పంట నేలకొరిగింది. రైతుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవట్లేదు’ అని ట్వీట్ చేసింది.

News October 28, 2025

వరదల సమయం.. పాడి పశువుల సంరక్షణకు సూచనలు

image

భారీ తుఫానులు, వరదలు సంభవించినప్పుడు రైతులు తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో, పశువులను అలాగే కట్టేసి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారు. అవి వరద నీరు వల్ల ఎటూ వెళ్లలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతాయి. అందుకే వరదల సమయంలో పశువులను పాకల్లో కట్టకుండా వదిలేయాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పశువులను ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వాటికి కొంత మేతను అందించాలి.

News October 28, 2025

వరదల తర్వాత పశువుల సంరక్షణకు సూచనలు

image

వరదల వల్ల పశువులకు గాయాలైతే వెంటనే చికిత్స చేయించాలి. వర్షాలు తగ్గిన తర్వాత పశువులకు కావలసిన మేత, నీరు సమృద్ధిగా అందించాలి. వ్యాధుల తీవ్రత తగ్గించడానికి పశువులకు టీకాలు వేయించాలి. పశువులు చనిపోతే కాల్చివేయాలి. బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు క్రిమిసంహారక మందులను వాడాలి. నీటిని శుభ్రం చేసి పశువులకు ఇవ్వాలి. పశువులను కట్టే చోట నీరు నిల్వ లేకుండా చూడటంతో పాటు దోమలు, ఈగల నిర్మూలనకు కృషి చేయాలి.