News July 20, 2024

శాంతిభద్రతలపై చంద్రబాబు దృష్టి సారించాలి: రామకృష్ణ

image

ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలన్నారు. ‘చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్నా APలో శాంతిభద్రతలపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. పుంగనూరులో MP మిథున్ రెడ్డి ఉన్న ఇంటికి వెళ్లి దాడి చేయడం సరికాదు. CBN వీటిని సరిదిద్దాలి. పోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారు’ అని విమర్శించారు.

Similar News

News February 10, 2026

స్పీకర్‌కు కాంగ్రెస్, BJP పోటాపోటీ లేఖలు!

image

ప్రతిపక్షాల నిరసనలతో ఊహించని పరిస్థితి ఎదురుకావచ్చని, <<19058377>>లోక్‌సభకు రావద్దని<<>> మోదీకి చెప్పానని స్పీకర్ ఓంబిర్లా వ్యాఖ్యానించడం తెలిసిందే. దీంతో తమ పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ మహిళా MPలు స్పీకర్‌కు లేఖ రాశారు. దీనికి కౌంటర్‌గా లెటర్ రాసిన BJP మహిళా MPలు.. ఆ రోజు గందరగోళం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ గౌరవాన్ని నిలబెట్టేందుకు సహనం ప్రదర్శించారని ఆయన్ను కొనియాడారు.

News February 10, 2026

గోర్లు విరిగిపోకుండా ఉండాలంటే?

image

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్​కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్​ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.

News February 10, 2026

రేపు సెలవు

image

TG: రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మికశాఖ రేపు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో రేపు 7AM నుంచి 5PM వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో పోలింగ్ ముగిసే వరకూ మద్యం షాపులు మూసి ఉంటాయి.