News May 10, 2024
LTI యాక్ట్కు అసెంబ్లీలో చంద్రబాబు మద్దతిచ్చారు: సజ్జల

AP: లాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు ప్రజల్ని భయపెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ‘అసలు వీళ్లు మనుషులేనా? విపక్షంగా ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తి మద్దతిచ్చింది. ఇప్పుడు పత్రికల్లో అడ్డగోలు ప్రకటనలు ఇస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ పూర్తయ్యాక భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది. ఈ యాక్ట్ చెత్త అని మోదీ, అమిత్ షాతో చెప్పించగలరా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 26, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 26, 2025
కోల్ ఇండియా లిమిటెడ్లో 125 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<
News December 26, 2025
లక్ష్మీదేవి కటాక్షం కోసం నేడు ఏం చేయాలంటే?

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున ఉప్పు కొనాలని పండితులు చెబుతున్నారు. అలాగే పడుకునేటప్పుడు ఈశాన్యంలో దీపం వెలిగించడం, ఆవులకు నెయ్యి, బెల్లం కలిపిన ఆహారం OR గడ్డి తినిపించడం మంచిదని అంటున్నారు. ‘లక్ష్మీదేవికి పూలను సమర్పించాలి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం గులాబీలు ఇవ్వాలి. సాయంత్రం పంచముఖి దీపం వెలిగించి, కర్పూరం హారతి బూడిదను పర్సులో ఉంచుకుంటే చేతిలో డబ్బు నిలుస్తుంది’ అని చెబుతున్నారు.


