News April 5, 2024
చంద్రబాబు.. మీ దిమ్మ తిరుగుతుంది: VSR

AP:ప్రజలు జగన్ను మరోసారి CMగా చూడాలని నిర్ణయించుకున్నారని YCP MP విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ‘మీ న’మ్మక’స్తుడు నిమ్మగడ్డ రమేశ్తో వాలంటీర్లపై విషం చిమ్మించావు. వదిన పురందీశ్వరితో 22 మంది IPSలపై ఫిర్యాదు చేయించావు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నా అనుకుంటున్నావేమో. ప్రజలు కొట్టే దెబ్బకు మీ దిమ్మ తిరుగుతుంది. ఇవే మీకు ఆఖరి ఎలక్షన్లు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 21, 2025
కామారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకుల నియామకం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లాకు ఎన్నికల పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ మకరందు నియమించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ హనుమంతు కొండిబను, ఆదాయ, వ్యయాల ఎన్నికల పరిశీలకులుగా నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇషాక్ అహ్మద్ను నియమించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకోనున్నారు.
News November 21, 2025
ప్రసార్భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <
News November 21, 2025
షాకింగ్ రిపోర్ట్.. భారత్పై పాక్ గెలిచిందన్న US!

అమెరికా మరోసారి భారత్పై అసత్య ప్రచారాలకు పూనుకుంది. పహల్గామ్ అటాక్ తర్వాత IND చేసిన ‘ఆపరేషన్ సిందూర్’కు పాకిస్థాన్ దీటుగా బదులిచ్చిందంటూ US సెనేట్లో ఓ నివేదికను సమర్పించింది. 4 రోజుల పోరులో పాక్ మిలిటరీ సక్సెస్ అయ్యిందని పేర్కొంది. ఈ సంఘర్షణను <<18335987>>చైనా<<>> తనకు అనుకూలంగా మార్చుకుందని తెలిపింది. ఈ రిపోర్టుపై INC నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.


