News July 8, 2024

ప్రజల ప్రయోజనాల కంటే TDP విస్తరణే చంద్రబాబు లక్ష్యం: విజయశాంతి

image

TG: ఏపీ CM చంద్రబాబుపై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. ‘తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు HYDకు వచ్చినట్లు అందరూ భావించారు. కానీ ఆయనకు TDP ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో టీడీపీ బలపడటం అసంభవం. బీజేపీతో కలిసి కుట్రలు చేస్తే రెండు పార్టీలూ గల్లంతవుతాయి. ఉద్యమకారులు తిరిగి పోరాటం చేస్తారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 6, 2025

టాస్ గెలిచిన భారత్

image

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.

భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

News December 6, 2025

4,116 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.rrcnr.org

News December 6, 2025

శబరిమల యాత్రలో మార్గదర్శి ‘గురుస్వామి’

image

శబరిమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులకు సమగ్రమైన మార్గదర్శకత్వం అందించే వ్యక్తే ‘గురుస్వామి’. ఆయన శబరిమల యాత్రకు సంబంధించిన వివరాలు, సంప్రదాయాలు, విశిష్టతలను భక్తులకు నేర్పిస్తారు. జ్ఞానం, పరివర్తన, స్వీయ-సాక్షాత్కారం కోసం దీక్ష తీసుకునే వారికి గురువు అవసరం ఉంటుంది. కఠినమైన శబరిమల యాత్రలో, ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి, ప్రతి భక్తుడు తప్పకుండా ఓ గురుస్వామిని ఎంచుకుంటారు. <<-se>>#AyyappaMala<<>>