News October 29, 2024

చంద్రబాబు చరిత్ర అదే: వైసీపీ

image

AP: గతంలో ఛార్జీలు పెంచడం అన్యాయమన్న ప్రజలపై బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి, తుపాకీలతో కాల్చిన చరిత్ర చంద్రబాబుదని వైసీపీ విమర్శించింది. ఆయనకు ప్రజలంటే లెక్కలేదని, ప్రశ్నిస్తే కాల్చి పారేస్తాడని ట్వీట్ చేసింది. ఆనాడు జనరల్ డయ్యర్, నేడు చంద్రబాబు ఒక్కటేనని పేర్కొంది. 4 నెలలకే CBN పాలన ఇలా ఉంటే నాలుగేళ్లు ఎలా భరించాలని ప్రజలు బాధపడుతున్నారని రాసుకొచ్చింది.

Similar News

News January 5, 2026

మలయాళ నటుడు కన్నన్ మృతి

image

మలయాళ నటుడు కన్నన్ పట్టాంబి(62) కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కేరళ కోజికోడ్‌లో మరణించారు. మోహన్‌లాల్ పులి మురుగన్(మన్యం పులి), కర్మయోధతో పాటు కాందహార్, ఓడియన్, కురుక్షేత్ర తదితర చిత్రాల్లో ఆయన నటించారు. కన్నన్ సోదరుడు మేజర్ రవి కూడా ఫిల్మ్ డైరెక్టర్. రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా రవి దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన ‘మిషన్ 90 డేస్’ మూవీలోనూ కన్నన్ కనిపించారు.

News January 5, 2026

కవిత కన్నీరు.. గులాబీ బాస్ స్పందిస్తారా?

image

అసెంబ్లీ సాక్షిగా కవిత కన్నీరు పెట్టుకోవడం TG రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నైతికత కోల్పోయిన BRSలో తానుండలేనని ఆమె ఏడ్చేశారు. దీంతో పార్టీ, కుటుంబంతో తనకున్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మొదటి నుంచీ పార్టీలో కీలకంగా ఉంటూ బతుకమ్మతో మహిళలను ఏకం చేసి రాష్ట్ర ఉద్యమానికి ఊతం తెచ్చిన కవిత ఇప్పుడు ఒంటరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గులాబీ బాస్ KCR ఎలా స్పందిస్తారో చూడాలి.

News January 5, 2026

వేల ఏళ్ల విశ్వాసం.. సోమనాథ్ పునరుజ్జీవనంపై మోదీ ట్వీట్!

image

సోమనాథ్ ఆలయంపై పాషండుల తొలి దాడి జరిగి 1000 ఏళ్లు, పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. 1026లో గజనీ మహమ్మద్ దాడి చేసినా ఎవరూ విశ్వాసం కోల్పోలేదని, అందుకే నేటికీ ఆలయం కళకళలాడుతోందని ఆయన పేర్కొన్నారు. 1951లో జరిగిన పునర్నిర్మాణం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని, సోమనాథుని దర్శనం సర్వపాప హరణమని ఆయన గుర్తుచేశారు.