News March 29, 2025
అమరావతిలో చంద్రబాబు ఇల్లు.. ఏప్రిల్ 9న భూమి పూజ

AP: సీఎం చంద్రబాబు అమరావతిలో ఇల్లు నిర్మించుకోనున్నారు. దీనికి ఏప్రిల్ 9న భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది చివర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ స్థలానికి, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కు మధ్య 2కి.మీ దూరం ఉంటుంది. కాగా పీఎం మోదీ చేతుల మీదుగా త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
Similar News
News March 31, 2025
KKR చిత్తు.. బోణీ కొట్టిన ముంబై

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై బోణీ కొట్టింది. KKRపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్(13) నిరాశపర్చగా, రికెల్టన్ 62*, జాక్స్ 16, సూర్య 27* రన్స్ చేశారు. రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటర్లంతా విఫలమవడంతో KKR 16.2 ఓవర్లలోనే ఆలౌటైంది. MI బౌలర్లలో కుమార్ 4, చాహర్ 2, బౌల్ట్, హార్దిక్, పుతుర్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
News March 31, 2025
తిరుమలలో మద్యం, మాంసం.. వైసీపీ ఆగ్రహం

AP: తిరుమలలో మద్యం, మాంసం వినియోగం, అనుచిత ప్రవర్తన ఘటనలు పెరిగిపోయాయని YCP విమర్శించింది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పరిస్థితి దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘JAN 18న తమిళనాడు భక్తులు కొండపై ఎగ్ బిర్యానీ తిన్నారు. మార్చి 15న మద్యం మత్తులో యువకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. మార్చి 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ మద్యం తీసుకెళ్లాడు’ అని పేర్కొంది.
News March 31, 2025
స్టూడియో ghibli కోసం ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారా?

సోషల్ మీడియాలో స్టూడియో ghibli ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ చాట్ జీపీటీ లేదా గ్రోక్ వంటి ఏఐల ద్వారా ఫొటోల్ని అప్లోడ్ చేసి ఘిబ్లీ స్టైల్లోకి మార్చుకుంటున్నారు. ఇది చాలా రిస్క్ అంటున్నారు సైబర్ నిపుణులు. ‘మనం ఇష్టపూర్వకంగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి యాప్లు ముఖ కవళికల్ని భద్రపరుచుకుంటాయి. దీని వల్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది’ అని వివరిస్తున్నారు.