News August 22, 2024

పాలనలో చంద్రబాబు బేలతనం బయటపడింది: వైసీపీ

image

‘అచ్యుతాపురం’ ప్రమాద ఘటనలో విపత్తు నిర్వహణ లోపం, సీఎం చంద్రబాబు పాలనలోని బేలతనాన్ని బయటపెట్టిందని వైసీపీ ట్విటర్లో విమర్శించింది. ఘటనపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని, ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత గానీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్‌మీట్ పెట్టలేదని విమర్శించింది. తప్పును తమపైకి నెట్టేలా పనికిమాలిన ఆరోపణలు చేశారంటూ మండిపడింది. బాబు 45 ఏళ్ల అనుభవంలో డొల్లతనం కనిపించిందని ఎద్దేవా చేసింది.

Similar News

News November 10, 2025

సిద్దరామయ్యకు సమయమివ్వని హైకమాండ్?

image

కర్ణాటకలో CM మార్పు చర్చ ఇటీవల జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్యతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమతో సమావేశం అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఇవే ఆదేశాలు ఇతర నేతలకూ వర్తిస్తాయని, అపాయింట్‌మెంట్లు అడగొద్దని స్పష్టంచేసినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో పుస్తకావిష్కరణకు మాత్రమే సిద్దరామయ్య పరిమితం కానున్నట్లు పేర్కొన్నాయి.

News November 10, 2025

పొద్దుతిరుగుడు సాగు.. విత్తన మోతాదు, విత్తనశుద్ధి

image

యాసంగిలో పొద్దుతిరుగుడు సాగుకు సాధారణంగా ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం అవసరం. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. సాధారణ దుక్కి పద్ధతిలో లేదా వరికోతలు తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.

News November 10, 2025

జీఎస్టీ సంస్కరణలు.. 50% పెరిగిన నెక్సాన్ సేల్స్

image

జీఎస్టీ సంస్కరణలు, పండుగ సీజన్‌తో అక్టోబర్‌లో ఆటోమొబైల్ సేల్స్ పెరిగాయి. SUV మార్కెట్‌లో పోటీదారుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజా సేల్స్‌ను టాటా నెక్సాన్ బీట్ చేసింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఈ మోడల్ సేల్స్ 50% పెరిగాయి. 2025 అక్టోబర్‌లో క్రెటా 18,381, నెక్సాన్ 22,083, బ్రెజా 12,072 యూనిట్లు సేల్ అయ్యాయి. నెక్సాన్ బేస్ మోడల్ రూ.7.32 లక్షల నుంచి మొదలవుతుంది.