News March 21, 2024
ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని: YCP

AP: ఎక్కడేం జరిగినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని అని YCP విమర్శించింది. ‘విశాఖలో దొరికిన డ్రగ్స్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థకు చెందినది. దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం కోటయ్య చౌదరిగా గుర్తించారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబూ.. వీళ్లు మీ పార్టీకి చెందినవారు కాదా? వీళ్లు ఎవరికి బంధువులు? నీకా నీ కొడుక్కా?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News November 25, 2025
చైనా ఎఫ్డీఐలపై ఆంక్షల సడలింపునకు కేంద్రం యోచన

చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)పై పెట్టిన ఆంక్షలను కాస్త సడలించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్టుల విషయంలో అనుసరిస్తున్న కఠిన నిబంధనలను సడలించాలని అనుకుంటున్నట్టు సమాచారం. కేంద్ర క్యాబినెట్ పరిశీలనకు అధికారులు ఒక నోట్ రెడీ చేశారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2020లో గల్వాన్ బార్డర్ ఘర్షణ తర్వాత చైనా ఎఫ్డీఐలపై ఆంక్షలు విధించింది.
News November 25, 2025
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడి మరో 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని.. 30వ తేదీన ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 25, 2025
ఈ దిగ్గజ మహిళా క్రికెటర్ గురించి తెలుసా?

ప్రస్తుత భారత మహిళా క్రికెట్ టీమ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. అయితే దీని వెనక డయానా ఎడుల్జీ పాత్ర ఎంతో ఉంది. 50 సంవత్సరాలకుపైగా క్రికెటర్గా, అడ్మినిస్ట్రేటర్గా ఎడుల్జీ భారత క్రికెట్కు సేవలు అందించారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకుని అప్పట్లో చాలామంది అమ్మాయిలు క్రికెట్కు ఆకర్షితులై ఆటలోకి అడుగుపెట్టారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన డయానా భారత్ తరఫున 54 మ్యాచ్లు ఆడి 109 వికెట్లు పడగొట్టారు.


