News March 31, 2024
పింఛన్ల పంపిణీపై సీఎస్కు చంద్రబాబు లేఖ
AP: ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సకాలంలో పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన నిధులను అందుబాటులో ఉంచి, పింఛన్ల పంపిణీకి తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీఈవోను కోరారు.
Similar News
News October 6, 2024
ఇవాళ పాకిస్థాన్తో భారత్ పోరు
ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత్కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్లో ప్రసారం కానుంది.
News October 6, 2024
నేడు సింహవాహనంపై ఊరేగనున్న స్వామివారు
AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ఉ.8 నుంచి 10 గంటల వరకు స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు. రా.7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుడి అలంకారంలో ఊరేగనున్నారు.
News October 6, 2024
మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే
ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.