News April 6, 2024

పింఛన్ల వ్యవహారంపై ఈసీకి చంద్రబాబు లేఖ

image

AP: కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పథకాలు అందించాలన్న సీఈసీ సూచనలను అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ‘నిబంధనలకు విరుద్దంగా సచివాలయాల దగ్గర పింఛన్లు ఇస్తున్నారు. టీడీపీని దోషిగా చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు విష ప్రచారం చేస్తున్నారు. 40డిగ్రీల ఎండలో వృద్ధులను సచివాలయాలకు పిలిపించారు’ అని మండిపడ్డారు.

Similar News

News December 21, 2025

RSSకు పొలిటికల్ అజెండా లేదు: మోహన్ భాగవత్

image

హిందూ సమాజ అభివృద్ధి, రక్షణ కోసం RSS పనిచేస్తుందని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. సంఘ్‌కు ఏ పొలిటికల్ అజెండా లేదని, సమాజాన్ని చైతన్యపరిచి భారత్‌ను మరోసారి ‘విశ్వగురు’ చేయాలనేదే టార్గెట్ అన్నారు. RSS గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని, అయితే అవి వాస్తవికత ఆధారంగా ఉండాలన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కోల్‌కతాలోని సైన్స్ సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

News December 21, 2025

డ్రాగన్ ముప్పుకు ‘ద్వీప’ కవచం: అమెరికా మాస్టర్ ప్లాన్!

image

A2/AD వ్యూహంతో అమెరికా నౌకలకు చైనా సవాల్ విసురుతున్న వేళ పెంటగాన్ తన పాత EABO వ్యూహానికి పదును పెడుతోంది. భారీ నౌకలపై ఆధారపడకుండా పసిఫిక్ ద్వీపాల్లోని WW-II నాటి ఎయిర్‌ఫీల్డ్స్‌ను పునరుద్ధరిస్తోంది. తద్వారా విస్తారమైన ప్రాంతంలో క్షిపణులను మోహరిస్తూ, తైవాన్ రక్షణే లక్ష్యంగా చైనా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారనుంది.

News December 21, 2025

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల సాగు

image

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.