News May 3, 2024
ఉద్యోగులు, టీచర్లకు చంద్రబాబు లేఖ

AP: ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లు, టీచర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ‘ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు చూశాను. జీతాలు రాక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తే కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ తెచ్చారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని మోసగించారు. ఉద్యోగులు భయపడకుండా ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


