News May 14, 2024
గవర్నర్కు చంద్రబాబు లేఖ

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో చేసే బిల్లుల చెల్లింపులను ఆపాలని ఆ లేఖలో కోరారు. బినామీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు రావాల్సిన నిధులు బినామీ కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఇలా జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.
Similar News
News February 9, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో 47 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్(బీఈ, బీటెక్), డిప్లొమా అర్హత గల వారు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు ఫిబ్రవరి 10న, డిప్లొమా ట్రైనీలకు ఫిబ్రవరి 11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nal.res.in/
News February 9, 2026
ముగ్గురు సిస్టర్స్ సూసైడ్.. BIG TWIST

ఘజియాబాద్లో ముగ్గురు సిస్టర్స్ <<19060937>>సూసైడ్<<>> కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో తండ్రి చేతన్ పొంతనలేని సమాధానాలిచ్చాడు. అతనికి ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారనే విషయం వెలుగులోకొచ్చింది. వీరంతా ఒకే రూములో నిద్రించేవారు. మరి ఆ ముగ్గురు బయటికెళ్తుంటే చూడలేదా అనే ప్రశ్నకు ‘ఇది వారి డైలీ రొటీన్లో భాగం’ అని తండ్రి చెప్పడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News February 9, 2026
లోక్సభ రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈక్రమంలోనే LoP రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా విపక్షాలు ఆందోళన చేపట్టడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


